పుట:Dvipada-Bagavathamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

105

సర్వాత్మలందును జరియించు నిన్ను
సర్వేశ! ఎఱుఁగంగఁ జనునయ్య నాకు”460
అని పల్కి హరిచేతి కక్రూరుఁ డెలమి
తనరార నాస్యమంతక మిచ్చి మ్రొక్కె
శౌరి సంతసమంది జ్ఞాతులు చూడఁ
గోరి యారత్న మక్రూరున కిచ్చె!
ఈ కథవిన్న మీ కీప్సితార్థములు
ప్రాకటంబుగ నిచ్చు భవబాధ లుడుగు
నపకీర్తు లడగించు నఘములుఁ జెఱచుఁ
గపటంబు లెడలు మంగళములు నిచ్చు"
నని చెప్పి మరియును నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుఁడు ఇంద్రప్రస్థపురమునకు వెడలుట


తనరంగ నింద్రప్రస్థంబున కరిగె.
అఖలలోకారాధ్యుఁడగు విశ్వగురుఁడు
సుఖతరంబుగఁ బాండుసుతుల నీక్షించి
సుదతి గొంతికి ధర్మసుతునకు మ్రొక్కి,
కదియంగ భీమునిఁ గౌఁగిటఁ జేర్చి
నవ్వుచుఁ దనమ్రోల నమ్రులై యున్న
కవ్వడికవల నొక్కట నెత్తి ప్రేమ
నందఱి సేమంబు లడుగంగ వార
లందఱుఁ బూజింప నానందమంది
గొంతియుఁ గృష్ణు నక్కునఁ జేర్చి దుఃఖ
మంతకంతకుఁ బేర్చి యార్తిమై నేడ్వఁ470
గరపల్లవంబునఁ గన్నీరుఁ దుడిచి
నరుదండఁ దన మేనయత్త నూరార్చి