పుట:Dvipada-Bagavathamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ద్విపదభాగవతము

ఆకన్యఁ బ్రీతిమై యశ్వపాలునకుఁ
జేకొని వడిఁ బెండ్లి సేసి పంపుటయు
నానాతి వరియించి యఖిలదుఃఖములు
మాని సుఖించ నమ్మనుజవల్లభుఁడు.450
ఆయింతి సుతుఁడైన యక్రూరుఁ డలిగి
పోయినకతమునఁ బుట్టె నీపాప

అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట


మనిచూచి శౌరియు నక్రూరుఁ బ్రేమఁ
బనివడి దూతలఁ బంచి రప్పించి
యతనితో నొక్కనాఁ డతిరహస్యమున
శతదళనేత్రుఁడు చతురుఁడై పలికె.
“అడరి సత్రాజిత్తు నడఁచి మాణిక్య
మురవడిఁ గొంపోవ నొగి వెంటఁ దగిలి
శతధన్వు నూరకె చంపితి గాని
యతులితంబగు రత్న మతనిచేఁ గాన
మక్కటా! శ్రీధనం బది పాడిగాదు
యిక్కువ జ్ఞాతుల కిది యహితంబు
నీయింట నతని మానిక ముండె గాన
యీయధ్వరములు నీకిటు సేయఁగల్గె
నిది నాకుఁ బ్రియమన్న" నిందిరావిభుని
పదపంకజములకుఁ బ్రణమిల్లి యతఁడు
“గోవింద! కృష్ణ! ముకుంద! మురారి!
పావనగుణపూర్ణ! పద్మాయతాక్ష!