పుట:Dvipada-Bagavathamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ద్విపదభాగవతము

హరిమానసము రోషమడఁగెడు నట్టి
వెర వేదియో యని విన్నపాటు నొంది

సత్రాజిత్తు సత్యభామను శ్రీకృష్ణునకు భార్యగా నర్పించుట


తనకూఁతు సత్య నుత్తమగుణాభరణఁ
దనరార గైసేసి తనవారుఁ దాను
మణితోడఁ గామినీమణి నొప్ప నిచ్చి
యణిమాదిగుణపూర్ణుఁడగు హరి కనియె.
“పరమేశ! నాకూర్మిపట్టి యీకన్యఁ
బరిణయంబై రవిప్రభ నొప్పుమణియు
ధరియింపు” మన్న మాధవుఁడా నరేంద్రుఁ
గరుణించి నెమ్మోముఁ గనుఁగొని పలికె.410
“అరులు మిత్రులు నాకు నరయంగ లేరు
పరమాప్తుఁడవు మాకుఁ బావనచరిత!
ఈనాతి నిమ్ము నాకిమ్మహారత్న
మేనొల్ల నే నీకు నిచ్చితి” ననుచు
నాతని కర్పించి యాసత్యభామఁ
బ్రీతిని బెండ్లాడె పీతాంబరుండు,
సత్యభామయుఁ దాను సంప్రీతితోడ
నత్యుదాత్తసుఖంబు లందె మురారి.

శ్రీకృష్ణబలభద్రులు కరిపురంబునకు వెడలుట


ఆలోనఁ బాండవులట లక్కయింటఁ
గాలి చచ్చుట విని కాలక నుంట