పుట:Dvipada-Bagavathamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్వాణకాండము

99

మున్ను బిలద్వారమున నున్న పౌరు
లాకంజలోచనుఁ డాపెడ నడఁగి
రాకున్న బెగడి పురంబున కరిగి
యావార్త నెఱిఁగింప నఖిలబాంధవులు
దేవకియును వసుదేవుఁడుఁ గలఁగి
దేవతాగణముల ద్విజలోకతృప్తిఁ
గావించిరంత; నామలలోచనుఁడు
ద్వారకాపురి సొచ్చి తగ నుగ్రసేను
నారూఢగతిఁ గాంచి యందఱుఁ జూడఁ
బ్రీతి సత్రాజిత్తుఁ బిలిచి ప్రసేనుఁ
డాతల వని మృతుఁడైన చందంబు
మరి జాంబవంతుఁడు మణి హరించుటయు
సరయ నాతఁడు కయ్యమాడిన తెఱఁగు
నచ్చుగా నెఱిఁగించి యతని కారత్న
మిచ్చి మనోవ్వధ నెడలె మురారి.400
ఉత్తములగు వారికొక నింద వొడమ
నుత్తలపడి తీర్ప కోర్తురే నిలువ!
అంత సత్రాజిత్తుఁ డమ్మణి దాన
వాంతకుచేఁ గొని యంతరంగమున
సిగ్గును దుఃఖంబుఁ జిడిముడిపాటు
నగ్గలంబొదవ నిట్లని విచారించె.
“అక్కటా! శ్రీనాథు నఖిలలోకేశు
నెక్కటి నిందించి నృపకోటిలోనఁ
బాపంబు సేసితిఁ బద్మాక్షుచిత్త
మేపాటి నొచ్చెనో యేమిగాఁగలదొ?