పుట:Dvipada-Bagavathamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ద్విపదభాగవతము

వైరంబు గొని పోరి వంచితు నైతి
నాతప్పు సైరించి నన్ను మన్నించు
నీ తత్వ మెఱుఁగంగ నేర్తునే” యనిన
“నాతోడ నిరువదినాళ్లు పోరాడ
భూతేశునకు నైనఁ బోలునే యందుఁ
బెద్దవు నీవు నాపిడికిళ్లు దాఁకి

శ్రీకృష్ణుఁడు జాంబవతీకన్యను బరిగ్రహించుట


తద్దయు నొచ్చె నీ తను"వంచుఁ బలు క
[1]సరసిజోదరుఁడు ఋక్షపున కిట్లనియె.
“ధరణిపై నీస్యమంతక నిమిత్తమునఁ
బరపైన యపకీర్తి పాటిల్లె మాకు;
నేపార నీరత్న మిచ్చి సంప్రీతి
వేపంపు” మనుటయు విని భల్లుఱేఁడు
నామణి నర్పించి యాత్మసంజాత
వామలోచన జాంబవతినిచ్చి హరికిఁ
బ్రణమిల్లి “ఈకన్యఁ బత్నిగా నేలు
ప్రణవాత్మ!" అనిపల్క, పద్మాక్షుఁ డతని
మన్నించి కన్యకామణితోడ మణి
గ్రన్ననఁ గైకొని కదలి యేతెంచె.390

బిలద్వారమందుండిన పౌరులు పురమును జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట


చెన్నార వెన్నుని సేవించి వచ్చి

  1. ఒకేపాద మున్నది.