పుట:Dvipada-Bagavathamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ద్విపదభాగవతము

రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట


“అక్కటా! ఈతఁడు నీయంతరం బెఱుఁగ
కిక్కడ నీచేత నిటుగట్టు వడియె
వెరగొప్ప నన్నుఁ దా విడిపింతు ననుచు
నరుదెంచినాఁడు నాయగ్రజుఁ డితఁడు
కలనిలోఁ బడువారిఁ గావక యిట్లు
పొలువసేతలు సేయఁ బోలునే యకట!230
నన్ను మన్నించి క్రన్నఁనఁ బ్రాణమెత్తు
మిన్ని దప్పులుఁ గాచి యతనిఁ బోవిడువు;”
మని పల్కు నంతలో నడరి సీరియును
జనుదెంచె వైదర్భి సైన్యంబు బఱచి,
హరిఁగూడుకొని సీరి యరడంబు మీఁదఁ
దురపిల్లు రుక్మి నుదురుఁ జూచి పలికె.

బలరాముఁడు రుక్మిని విడిపించుట


“తగువాఁడు వియ్యము ధరణీశసుతుఁడు
తగదిటుసేయ నితని వేగ విడువు”
మనిపల్కి బోధించి యతని విడిపించి
మనసు క్లేశము మాన్పి మరి రుక్మి ననిపి
యారామఁ దోడ్కొని యనుజుండు దాను
ద్వారవతికి నేఁగెఁ దాలకేతనుడు
పౌరు లెదుర్కొని పట్టణం బెల్లఁ
గోరిసింగారింప గురుమూహూర్తమున
రాముఁడు హరియుఁ బురప్రవేశంబుఁ