పుట:Dvipada-Bagavathamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

77

శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట


ఆకన్యయును బ్రేమ నంబుజోదరుని
రాకాశశాంకవిరాజితవదను
మకరకుండలకర్ణమాణిక్యరుచిర
వికచగండస్థలు విభవేంద్రవంద్యుఁ
నారూఢయవ్వను నతులసౌభాగ్యు
నారాయణుని హరి న్నళినాక్షిఁ గాంచి
సిగ్గును భయమును జిడిముడిపాటు
నగ్గలింపఁగ నిల్చె నంబుజనయన;
ఆలోనఁ గృష్ణుఁడు నవ్వాలుగంటి
నాలింగనము సేసి యర్మిలి నెత్తి150
కొనిపోయి రథముపైఁ గూర్చుండఁ బెట్టి
యనునయోక్తులఁ చేర్చి యంగంబు నిమిరి
దారకుఁ జూచి "రథము వేగ పఱవు
ద్వారకాపురిక" ని దైత్యారి కదలె.

పౌండ్రకాదులు శ్రీకృష్ణునిఁ దాఁకుట


ఆసమయంబున హరి భీష్మతనయ
నాసురంబునఁ గొంచు నరుగుటనెల్ల
విని చైద్యమాగధవిభు లాగ్రహమునఁ
జనిరంతఁ బౌండ్రకసాల్వవైదర్భు
“లెక్కడికృష్ణుడు? ఎక్కడి రాముఁ
డుక్కడంచెద”మని యరువడిఁగదలి