పుట:Dvipada-Bagavathamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ద్విపదభాగవతము

కలయఁ గుంకుమనీటఁ గలయాపులలికి
మెలుపార కస్తూరి మేడలఁ బూసి
మొనసిన కప్పురమున మ్రుగ్గు వెట్టి
తనరారఁ గదలికాస్థంభంబు లెత్తి,
పురము సింగారించి పురుహూతులీలఁ
దరుణులు గొలిచిరా తరుణులుఁ దాను
వందిసన్నుతగీతవాద్యముల్ మొరయఁ
జెంది పేరంటాండ్రు సేసలుఁ జల్ల
గురుసంపదల నెదుర్కొని తోడితెచ్చి
ధరణీశవరుల నండఱి మనోహరము
లగుచోట విడియించి యఖిలసౌఖ్యములుఁ
దగుభక్తి నొనరించి దక్షులఁ బిలిచి
ఘడియారమిడఁగ మంగళతూర్యనినద
మెడపక మ్రోయంగ నెఱిఁగి రుక్మిణియు70

రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట


కలఁగి మ్రాన్పడి నిల్చు, కళవళంబందుఁ
బెలుకుఱులోఁ దాఱు పెదవులుఁ దడపుఁ
బలుకకూరకనుండుఁ బలుమాటలాడు
నిలువనేరక వ్రాలు నిట్టూర్పువుచ్చు
నంతయు హరిఁ జేర్చు నంతరంగమున
సంతాప మొదవంగఁ జర్చించి చూచు;
“నక్కట! యెక్కడి కరిగెనో! విప్రుఁ
డెక్కడఁబోయనో! ఏలకోతడసె!