పుట:Dvipada-Bagavathamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు
శుభమస్తు

ద్విపదభాగవతము

కల్యాణకాండము

విదర్భరాజు తనకుమార్తె రుక్మిణిని శిశుపాలుని కిచ్చుటకుఁ దీర్మానించుట


ఆరూఢయౌవన నాయింతి జనకుఁ
డేరాజు తనయున కిత్తు నేననుచు
జింతించి చైద్యుండు శిశుపాలుఁ డర్హుఁ,
డింతికి నని నిశ్చయించి పెండ్లికిని
సకలదిక్పాలుర సకలభూపతుల
సకలమహీశ్వరసమితి రప్పించి
ధీయుక్తిమై నాఱుదినములలోన
నాయతంబగు లగ్న మరుదెంచుటయును
నంత రుక్మిణి యంతయు నెఱిఁగి

రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణునివద్దకు పంపుట


చింతించి "నేనింక శిశుపాలు నెట్లు
వరియింతు? త్రైలోక్యవరుఁడు నావిభుఁడు