పుట:Dvipada-Bagavathamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ద్విపదభాగవతము

చేకొని కాల్పఁగా సీయు హరియు
వారుఁ గానక యుండ నడిదిగ నుఱికి
ద్వారకాపురికి నిద్దఱు నేఁగిరంత.670

బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి జరాసంధుఁడు మఱలిపోవుట


నాలో జరాసంధుఁడా గోపవరులఁ
గాలి చచ్చినవారిగా నిశ్చయించి
యగణితంబగు సేనలన్నియుఁ గొలువ
మగధదేశమునకు మగుడ నేతెంచె.
అక్కడ గోవిందుఁ డఖలబాంధవులుఁ
దక్కక తనుఁగొల్వ ద్వారకాపురిని
నానకదుందుభి యనుమతి నుగ్ర
సేనుఁడు తనపంపు సేయ సామ్రాజ్య
కలనంబునకుఁ దానె కర్తయై పేర్చి
బలభద్రుఁగూడి నిర్భయవృత్తి నుండె.
మధురలోపల శత్రుమథనంబు సేసి
మధువైరి విహరించు మహానీయకధలఁ
దాత్పర్యమున విన్న ధన్యచిత్తులకు
సత్పుత్రలాభంబు శత్రుజయంబుఁ
గమనీయధర్మార్థకామమోక్షములు
సమకూరి హరిభక్తి సౌఖ్యంబు నొందు
నని చెప్పుటయు వీని ననఘునిచేత
విని కృతార్ధుఁడనైతి వివిధసంపదల
హరి యెట్లు విహరించె నట మీఁది కథలఁ