పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్దాసనిచయచింతామణి
నే సింగర గురుశిఖామణిం గణుతింతున్.

8


ఉ.

రాముని చెట్టఁబట్టి రహి రాజిలు కావ్యపురంధ్రి కగ్గమై
వేమరు మించనాడుట వివేకము గాదని యేల తోచదో
పామరులార సత్కవుల పాలి శనైశ్చరులార దుష్కవి
గ్రామణులార యిట్లు కొఱగా దనఁగా వినరా నరాధిపుల్.

9


శా.

ఛందోలంకృతి భేదభావగుణదోషప్రౌఢులం దెల్ల ని
స్పందేహ ప్రతిభావిభాసురమనీషల్ గాంచు ధీరాత్మకుల్
నందింపం దగు నొక్కవేళ నెఱ సూనం గాఁ దగున్ గాక యే
సందుల్ రాని బిగాది పండితుల కెంచంబోలునే కావ్యముల్.

10


తే.

కానిపని కాని గవగవఁ గవయఁ గవయఁ
గవులు కవులని కవులాడు కవులు కవులె
ఐన పనికైనఁ గలగలమనక వెనుకఁ
గవులు కవులని లాలించు కవులు కవులు.

11


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును కుకవినికరావమాననంబును సుకవి
సంకీర్తనంబునుం గావించి యెద్దియేనియు నొక్క ప్రబంధంబు ఘటి
యించి రఘుపతిచరణారవిందంబులకు సమర్పణంబు గావింపం దలంచు నవసరంబున.

12


సీ.

పెన్నురంబునఁ బాలమున్నీట నుదయించు
        తరుణీలలామంబు దనరు వాఁడు,
అభినవజలధరశ్యామలంబగు మేన
        రాణించు కనకాంబరంబు వాఁడు,
బొడ్డుదామరమీఁద భువనముల్ సృజియించు
        నలుమొగంబుల ప్రోడ గలుగు వాఁడు,
ఆద్యంతశూన్యుఁడై యఖలలోకంబుల
        నిజదివ్యతేజంబు నెఱపు వాఁడు,