| మన్నెకులోద్యాన మధుమాసపైకంబు | |
గీ. | అని జనుల్ మెచ్చఁ గీర్తిచే నలరి తహహ | |
వీ రనేకదేవాలయములకు భూముల నిచ్చిరి. బ్రాహ్మణులకు వసతులు గల్పించిరి.
మాణిక్యారావువారు కల్పించిన దేవబ్రాహ్మణవృత్తులు.
1. పెద్దపూడి :-
ఇది వకసంతు, కూచిపూడి సర్కారు. ముర్త్యుజానగరు తాలూకాలోనిది. ఇది ప్రస్తుతము వాసిరెడ్డివారికి పోయినది.
పూర్వము అరణ్యముగానున్న ఈ స్థలములో ఋషులు సోమేశ్వరస్వామిని, వీరు గోపాలస్వామిని ప్రతిష్టించిరి. 1056 శకంలో గజపతాన్వయులు, గణపతి మహారాజులుగారు పరిపాలించిరి. వీరికి ప్రధానులు గోపరాజురామన్న. గ్రామకరిణీకపు మిరాశీలు వీరు ఏర్పరచుచు, తెలగాణ్యులు, కౌశికగోత్రులై న పుచ్చరాజువారికి సగభాగంగా యిచ్చినారు. 1240 శకం లగాయతు రెడ్డిరాజులు ప్రభుత్వం చేసిరి. వీరికాలములో కొండవీటిసీమ 44 అగ్రహారములు బ్రాహ్మణులకు దానంచేసిరి. వేగినాటివారికి 3 అగ్రహారములు ద్రావిళ్లకు 5 వెలనాటివారికి 36. ఈ గ్రామము వెల్నాటివారిక్రిందకు వచ్చెను. ఈ గ్రామం యెల్లేపద్ది లక్ష్మణదీక్షితులుకు, షడ్దర్మనాల వల్లభసోమయాజులుకు దానం చేసిరి. పైజీర్ణదేవాయములను మరల ప్రతిష్టించి ఏర్పరచినవసతులు కుం 070 శ్రీ సోమేశ్వరస్వామివారికి. కుం 070 గోపాలస్వామివారికి. 1500 శకం వరకు చక్కగాజరిగెను. మహమ్మదీయుల పరిపాలనలో విచ్చిత్తు గలిగినది. కొండవీటిసమతుబందలు చేసేటప్పుడు, ఈ గ్రామం కూచిపూడి సమ