పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్యములు) అతని రెండవ కొడుకు తిరుపతియే యేతత్కృతి ప్రేరకుఁడు. ఈతడు క్రీ. 1775 దాకనున్నవాఁడు. (చూ. 56 నుండి 72 దాఁక పద్యములు). వీరి వంశము కృష్ణా, గుంటూరు మండలములందు చిరకీర్తి నార్జించినది. దాతృత్వమునండును, శౌర్యమునందును నీవంశమువారు సుప్రఖ్యాతులు. ఈ వంశమున నేఁడు వర్థమానులుగా నున్న శ్రీ వెంకటహయగ్రీవరావుగారి తాతగారు వెంకటగోపాలరావుగారు, విలువిద్యలోను అశ్వారోహణకలలోను జితశ్రములని, చాల సౌందర్యవంతులని, సకలకలారసికులని వారిని బ్రత్యక్షముగా నెఱిఁగినవారు మా నాయనగారు చెప్పఁగా వింటిని. వారిని గూర్చి వింతకథలు, కృష్ణా గుంటూరుమండలవాసు లిప్పటికిని జెప్పుకొనుచుందురు. వారి ప్రధానగ్రామమగు రాచూరి దగ్గఱనే పల్లెకోన గ్రామమున భట్టురాజులు చదువగా నీ క్రిందిచాటుపద్యములు నీ వంశమువారి యోగ్యతను వెల్లడించువానిని నేను చాటుపద్యమణిమంజరిలోఁ బ్రకటించితిని.

సీ.

సుమమౌక్తికానల్పసుప్రతీకంబుతోఁ
                      గంబుతోఁ బుండరీకంబుతోడఁ
బల్లవకుసుమ సంపాదనైకాంతుతో
                      గంతుతో రోహిణీకాంతుతోడ
నధిగతపరమోగ్రుఁ డైన స్వర్భానుతో
                      ఖాను నలచిత్రభానుతోడతో
దండిగాండీవకోదండాభిరాముతో
                      రాముతో నందనారాముతోడ


గీ.

నీదుసత్కీర్తి నీమూర్తి నీప్రతాప
దీప్తి నీదోర్పలస్ఫూర్తి దీటు మిగిలి
యలరె మాణిక్యరాయవంశాబ్ధిసోమ
భాసురగుణాళి భావభూపాలమాళి.


సీ.

ఒక తాత కుతుబుశా ప్రకటదక్షిణభుజా
                      దండుఁడై కోవెలకొండ యేలె