పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షాకరణంబు నొడ్లకపకారులుగా రెపు డప్పుగోరు మం
దాకినితోడబుట్టియు గుణప్రతిభన్ వెలుమల్ పురంబునన్.

కాళహస్తి, వెంకటగిరి, నూజివీడు, పిఠాపురము, బొబ్బిలి, మైలవరము, నరసారావుపేట, పెదపవని, కొల్లాపురము, తిరువూరు రేపల్లె, రాచూరు, ఉల్లిపాలెము, మొదలగు స్థలముల వెలుమవా రిప్పటికిని జమీందారులుగా నున్నారు. అందు మన కిప్పుడు ప్రసక్తులు, రేపల్లె, రాచూరు జమీందార్లగు మాణిక్యాలరావు వారు. వీరితొల్తటియింటిపేరు కృష్ణానేనివారు. వీరు పుణ్యపలిగోత్రమువారు. తొల్త వీరు తెలుంగాణమున (నైజాం రాష్ట్రమున) నుండిరి. ఇప్పటికిని వీరిబంధువులు, అనుమకొండ దగ్గఱ పెదపెండ్యాలలో ' పొట్లపల్లివారు' అనఁబరగుచున్నారట. వీరికి మాణిక్యారావు వారని బిరుదుపేరు కుతుబ్ షాహ యిచ్చినాఁడు. జైనులలో, మాణిక్యచంద. మాణిక్యసీన, మాణిక్యదేవాది నామములు మాణిక్య పదఘటితములు గలవు. తెలుఁగాణమున మాణిక్యప్రభువను యోగీంద్రుఁ డెప్పుడో" వెలసెనట. వారి శిష్యపరంపర నేఁడును తెలుఁగాణమునఁ గలదు. ఇది వారి పేర ఏర్పడిన బిరుదేమో! ఈ వెలమప్రభువు పూర్వుఁడో ఆమాణిక్యప్రభుయోగి పూర్వుఁడో నే నెఱుఁగను.

వీరి వంశవృక్ష మిట్టిది.

పద్మనాయఁకులు దెబ్బదియైదు గోత్రముల వారట. వారిలో కుతుబ్ షాహాకు ఆశ్రితుడు మాణిక్యారాయఁడు, అతఁడు కోవెలకొండ, మెదకు, పెదకొండపల్లి, కొండవీడు, దుర్గములఁ గాచినందుకు కుతుబ్ షహా, బిరుదు లిచ్చినాడు (చూ. 21 నుండి 29 పద్యముదాఁక, ప్రథమాశ్వాసము). ఆతని కుమారుఁడు కొండలరాయడు అబ్దుల్లా పాదుషా కాశ్రితుఁడై బిరుదులందెను. (చూ. 32 పద్యము) అతని మునిమనుమని కొడుకు అప్పభూపతి ఔరంగజేబునకు ఆశ్రితుఁ డయ్యెను (చూ. 32, 33 పద్యములు) తత్పుత్రుఁడు తిరుపతిరాయఁడు. ముర్తుజాన్నగరము పాలించెను. (చూ. 34 నుండి 40 దాఁక పద్యములు). ఈతని కాఱుగురు కొడుకులు. ఆఱవవాఁడగు సీతన్నమాణిక్యరావు (47 నుండి 50 దాఁక