పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ధనుర్వేదమున ముక్తాముక్తాదిచతుర్భేదకములు గాక నియుద్ధమని పంచమభేదమును దరువాతి శాస్త్రజ్ఞులు గ్రహించిరి. తద్భేదములన్నియు మల్లయుద్ధములలోఁ బ్రయోగింపఁబడునవి. నాచనసోమనాథాదులు యుద్ధప్రక్రియల నుత్తరహరివంశాదుల వర్ణించియుండుట యెల్లరకు విదితమే గదా!

ధనుర్వేదదైవతమంత్రస్వరూపముల వైశంపాయనుఁడు తన నీతిప్రకాశికలో నిట్లు వర్ణించుచున్నాడు.

“చతుష్పాచ్చ ధనుర్వేదో రక్తవర్ణశ్చతుర్ముఖః
అష్టబహుస్త్రిణేత్రశ్చ సాంఖ్యాయన నగోత్రవాన్
వజ్రంఖడ్గోధనుశ్చక్రం దక్షిణే భుజమండలే
శతఘ్నీ చ గదాశూలం పట్టిసం వామబాహుషు
ప్రయోగకోటీరయుతో నిత్యాంగో మంత్రకంచుకః
ఉపసంహారహృదయః శస్త్రాస్త్రోభయకుండలః
అనేకవల్లితాకారభూషణః పింగళేక్షణః
జయమాలా పరివృతో వృషారూఢస్సన ఉచ్యతే”

అని స్వరూపప్రతిపాదనానంతరము—

"తన్మంత్రం చ ప్రవక్ష్యామి వైరిజాలనికృంతనం
ఆత్మసైన్య స్వపక్షాణా మాత్మన శ్చాభిరక్షకమ్
ఆదౌ ప్రణవ ముచార్య నమ ఇత్యక్షరే తతః
వతేతి భగపూర్వం తు ధనుర్వేదాయ చోచ్చరేత్
మాం రక్ష రక్షేత్యుచ్చార్య మమ శత్రూన్ వధేతిచ
భక్షయేతి ద్విరుచ్చార్య హుంఫట్ స్వాహే త్యథోచ్చరేత్
అహమేవ ఋషిశ్చాస్య గాయత్రీ చ్ఛంధ ఉచ్యతే
మహేశ్వరో దేవతాస్య వినియోగో౽రినిగ్రహే
ద్రాత్రింశద్వర్ణకమనుం వర్ణసంఖ్యాసహస్రకైః
జపిత్వా సిద్ధి మాప్నోతీ రిపూంశ్చాత్యధితిష్ఠతి”