పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

157


గీ.

పరపు నిన్నూటయేఁబదిబార లొకఁడు
పరపు మున్నూటముప్పదిబార లొకఁడు
పరపు మున్నూటయఱువదిబార లొకఁడు
పరపు విశిఖంబు నన్నూఱుబార లొకఁడు.

153


వ.

మఱియు నిరంతరాభ్యాసబలంబున నేనూఱుబారలకొలంది విశిఖంబు
నడుపందగు నిదియును సకలజనసాధారణంబు గాకుండు నైనను
నొక్క విశేషంబు గల దమూల్యంబులగు శరాసనంబులును ననర్ఘ్యం
బులగు శిలీముఖంబులును ననుకూలంబులగు సమీరప్రేరణంబులు
కలిమిం జేసి కొన్నిదేశంబుల ధనుర్ధరులు కొలంది నతిక్రమించి యేయం
జాలియుండుదు రదియును సాధనబలంబునం గాని యభ్యాసబలంబునం
గాదని నిర్దేశింపందగు నవియును వివరించెద నాకర్ణింపుము.

154


సీ.

నడుపుదు రీహస్తినగరంబువారలు
        ప్రదర మేనూఱుబారలకొలంది
బాణంబు సౌవీరపతు లేతు రేనూట
        నలువదినాల్గుబారలకొలంది
పరగింతు రంబు నేపాలభూపాలకుల్
        రహి నాఱునూఱుబారలకొలంది
సాగింతు రంబు కోసలదేశవాసులు
        లలి నేడునూఱుబారలకొలంది


గీ.

సలిలములగాడ్పు లేవేళ నొలయుచుంట
శార్ఙ్గము శిలీముఖంబును జబ్బు వారి
తలగ దిన్నూఱుబారలకొలఁది మీఱి
యిషువు బంగాళభూపతు లేయునపుడు.

155


వ.

వెండియు నేడునూఱుబారలకొలంది శిలీముఖంబు లతిక్రమింప నేయం
జాలిన కౌశలంబు మంత్రబలంబునంగాని సాధనాభ్యాసబలంబులం
గాదని నిర్దేశింపందగు మఱియును.

156