పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

రంగవిధానము


వ.

మఱియును.

37


ఉ.

వాసరనాథజీవభృగువారములం దొలుదొల్త నూతనా
భ్యాసికి లక్ష్యవేది పరిపాటి నమర్పఁదగున్ నిరంతరా
భ్యాసికి సౌమ్యవార మశుభంబగుఁ దక్కటి యాఱువారముల్
భాసిలు లక్ష్యవేది నిలుప ధనురాగమసమ్మతంబులై.

38


వ.

ఇట్లు నూతనాభ్యాసి పూర్వోక్తంబులగు రవిగురుభార్గవవారంబులఁ
బంచాంగసంగతంబగు నొక్కవాసరంబున లక్ష్యవేదికావిధానంబు
పూర్వోక్తప్రకారంబున నాచరింపంజేసి.

39


సీ.

ఆవేళ వేకువ నవలీల మేల్కాంచి
        యఘమర్షణస్నాన మవధరించి
భవ్యమాల్యాంబరాభరణముల్ ధరియించి
        తిలకంబు నుదుటఁ జిత్రీకరించి
ఆగమోక్తుల ధనుర్యాగంబు గానించి
        యగ్నిప్రదక్షిణ మాచరించి
ధాత్రీసురులకు సంతర్పణల్ గావించి
        వార లొసంగు దీవనలు గాంచి


గీ.

బొమిడికం బుత్తమాంగకంబున ధరించి
కంచుకము గూర్పరమ్మున మించఁ గొడిగి
అవల గోధాంగుళిత్రాణ మవధరించి
రంగమధ్యంబుఁ జేరి ధీరత రహించి.

40


సీ.

రహి నిష్టదేవతాప్రార్థన గావించి
        శరశరాసములపూజలు ఘటించి
మ్రొక్కుచు గురునాజ్ఞ ముదమున భావించి
        యవల ధాత్రీదేవి నభినుతించి