పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

రంగవిధానము


బొరి నర్ధమండలంబున
మరలి సమస్థానకమున మలయన్ వలయున్.

11


వ.

ఇవ్విధంబునఁ బ్రత్యాలీఢస్థానకంబున సంస్థితుండై ద్విత్రిచతుఃపంచ
వితస్తిప్రమాణంబుల జంగ సాచి తత్తదనుకూలంబులగు పూర్వోక్త
లక్షణంబుల నుపలక్షితుండై డాపలముష్టి దృష్టి నెలకొనం జేయుచు
చుబుకాధరమధ్యంబునను దక్షిణలోచనాపాంగప్రదేశంబునను
దక్షిణకర్ణాభ్యర్ణంబునను మౌర్విని నిలుపుచు నెడనెడఁ బుంఖోద్వే
జనశరమోచనంబు లానందకరణిం గుణంబు వదలి సింహగర్జనంబు
సేయుచు నర్ధమండలంబున సమస్థానకంబునకు వచ్చి ధనురాలింగ
నంబు సేయుచుఁ గ్రమ్మఱ మౌర్వి తివియం దగు.

12


క.

ఈ చెప్పినచందంబుల
వాచాలుం డగుచుఁ బెక్కువరుసల దివియన్
జూచిన చాపము బరువై
సూచితగతి గాత్రమునకు సొలపు ఘటిల్లున్.

13


ఉ.

అంతట మాని సారతమై బెడిదంబగు ద్రోణముష్టిచేఁ
గొంతపరిశ్రమంబు గని కొండొకసాముల నారితేరి య
శ్రాంతము నిట్లు శస్త్రగురుసన్నిధి రంగమునన్ వినీతుఁడై
యెంతయు సావధానమతి నేడ్తెఱ నభ్యసనంబు సేయుచున్.

14


వ.

వెండియుఁ జతురస్రదీర్ఘచతురస్రంబులగు ముష్టివిశేషంబుల ధను
ర్గ్రహణప్రకారంబులును, కటకాముఖ కర్తరీహంసముఖ నామకం
బులగు హస్తంబుల గుణాకర్షణప్రకారంబులును, యథావిధి నభ్య
సింపుచుఁ దక్కుంగల్గు నాలీఢసమవైశాఖమండలస్థానచతుష్టయం
బునం బేర్వేఱ నాకుంచితప్రేరితప్రముఖంబులగు విశేషంబుల నభ్యా
సంబు సలుపందగు మఱియును.

15