పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

రంగారాధనము


హృద్యానవద్యవిద్యానుద్యోతితప్రశంసులగు విద్వాంసులును,
గావ్యనాటకాలంకారధోరణీపరిణతానల్పకల్పనానుభవులగు మహా
కవులును, భాసురేతిహాసోపన్యాసవ్యాసోద్భాసితవాణీశ్రేణికులగు
పౌరాణికులును, నిరతిశయరాజ్యలక్ష్మీసమాగమకళానుబంధులగు
బంధులును, ధీమంతులగు సామంతులును, సంధివిగ్రహయానాసన
ద్వైధీభావసమాశ్రయణాభిధానషడ్గుణయథానుసంధానపరికర
పరతంత్రులగు మంత్రులును, ఘననయదేశీయభేదాపాదితహృద
యంగమసంగీతగోష్టీవిధాయకులగు గాయకులును, నానావిధ
జాతీయకథాసూచకులగు పరియాచకులును, శ్రోత్రపుటైకపాత్ర
కథాస్పందులగు వందులును, సముచితాస్తరణంబులం బరివేష్టింప
నగ్రభాగంబున మణిఖచితకాంచనపీఠంబున నాచార్యు నాసీనుం
గావించి తానును బవిత్రామరణంబునం బ్రాఙ్ముఖంబుగా నాసీ
నుండై కల్పోక్తమంత్రతంత్రప్రయోగకలనాసమాహితులగు
పురోహితు లిరుఁగెలంకులం గలసి పూజోపకరణంబులగు చందన
కఃసుమతాంబూలాదిభవ్యద్రవ్యంబు లుచితప్రదేశంబుల నమర్చి,
పరిత్రాస్తరణంబున శరశరాసనంబు లునిచి వినాయకప్రార్థనా
పూర్వకంబుగాఁ బుణ్యాహవాచనంబు సలుప దానును సమాహిత
మనస్కుడై మఱియును.

267


ఉ.

వాసవుఁ డాదిగా ఖచరవర్గ మనర్గళభక్తి నిన్నుఁ గై
సేసి నిరంతరాయమునఁ జేకొనుచుండుదు రీప్సితార్థముల్
దోసిలియొగ్గి నిన్ బ్రియముతోఁ దలతున్ గొలుతున్ ధనుఃకళా
భ్యాస మనంతరాయముగఁ బాటిలఁజేయఁగదే గణాగ్రణీ.

268


గీ.

అని వినాయకుఁ బ్రార్థించి యష్టదిశల
నమరు నింద్రాగ్నియమనైర్వతాబ్ధిరాజ
పవనయక్షరాట్కలాసపతుల నామ
తించి కల్పోక్తవిధులఁ బూజించి మఱియు.

269