పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

శరనిర్మాణము


తే.

మెలమి గనుపడు నిట్లుగా నివ్విశేష
మస్త్రవిద్యార్థపారగు లైనయట్టి
ఘనులసన్నిధి నభ్యాసమున ఘటించు
చాపధరుఁడు ధనుఃకళాసమధికుండు.

106


వ.

విను మిందు వైష్ణవంబును స్వస్తికాసనంబునుం గాక శుద్ధప్రత్యా
లీఢంబునం దాఱుభేదంబు లంగుళీభేదంబుల నేర్పరింతురు అట్లైన ననేక
భేదంబు లేర్పడు నాఱుతెరంగు లనుటకుం గొలఁది గాకుండు గావున,
వితస్తిద్వితయంబు, వితస్తిత్రితయంబు, వితస్తిచతుష్టయంబును
వితస్తిపంచమంబును, గొలందులుగా నడుగుల విన్యాసంబుల నాల్గు
తెఱంగు లేర్పరించి, వైష్ణవ స్వస్తికాసనంబులతోడ నాఱుతెఱంగు
లనుట సుగమంబై యుండు, వైష్ణవస్థానంబు శరప్రయోగ్యంబు గాకుం
డియు, స్థానంబుల నగ్రగణ్యంబగుఁ బ్రత్యాలీఢంబునకుఁ బ్రథమపరిక
రం బగుటం దత్రృతిష్ఠానంబ నాఁ బరగుచుండు స్వస్తికంబు భిన్న
ప్రకారం బయ్యునుం బ్రత్యాలీఢంబునం బట్టుటం దత్రృతిష్ఠానంబ
నాఁ బరగు, నిట్లు ప్రతిష్ఠానయుగళంబునకు లక్షణంబు ప్రతిష్ఠానప్రకర
ణంబున వక్కాణింతు, నింక నాలీఢస్థానంబున ధనుర్ధరుండు నిలు
పందగు విన్నాణం బుపదేశించెద నాకర్ణింపుము.

107


వ.

ఆలీడస్థానవిభాగము.

(ఎ.) 107


మ.

కడిమిన్ వామపదంబు ధాత్రిపయిఁ జక్కన్ నిల్పుచుం మూరెఁటన్
గుడిహజ్జమ్మును జంగ సాఁచి యుభయాంగుష్ఠాంగముల్ లక్ష్యమం
దిడి పార్ణిద్వయ మిట్టటున్ గదలఁగా నీరన్ ధృతిన్ నిల్చి తూ
పడరింపన్ వశమౌ ధనుర్ధరుల కయ్యాలీఢ మారూఢమై.

108


వ.

ఈలక్షణానకు కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు.

109


సీ.

కుడికాలుజంగ మూరెఁ డెడంబుగా సాఁచి
        కుడికాలు వంచక కుదురుపఱచి,
పదద్వయాంగుష్ఠముల్ పటుశరవ్యంబున
        కెలమిఁ జక్కనగాఁగ నిలిపిఁ నిలిచి,