పుట:Delhi-Darbaru.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

డీల్లీన గ ర చ రి త్ర ము



ద్వార ము లు.

కాశ్మీరద్వారము, లాహోరుద్వారము, ఢిల్లీ ద్వారము, అనునవి వీనియందు ముఖ్యములు. ఈ ద్వారముల పటములను మాచదువరు లిందు చూడఁగలరు

తోటలు

రాణి తోటయనునది షహజహాను బాదుషాహగారి పుత్రిక యగు జహనారా బేగముచే వేయఁబడిన ఉద్యానవన మని ప్రతీతి గలదు. దీని మధ్య ప్రదేశమున యమునాకాలువ లోని యొక శాఖ ప్రవహిం చుచున్నది. దీనివలన నీయుద్యాన వన మిప్పుడును బహుసుందరమయి యలరారు చున్నది. కాని పూర్వకాలమున సంతకంటె సుందర తరముగ నుండియుండెనను టకు సందియము లేదు. ఇప్పుడీ యుద్యానవనము నలంక రించు వస్తువులలో శ్రీ విక్టోరియా మహారాణి గారి శిలారూప మొక్క టియు రాతితోఁ దీర్చఁబడిన ఏనుఁగుస్వరూప మొక్కటియు నున్నవి. ఈ రాతి ఏనుఁగు పూర్వము ఢిల్లీ ద్వారమున నుం డెడిది. ఢిల్లీయందీ యుద్యావనన 'మొక్కటి గాక దర్శింవ సర్హల ములగు సొంపైన తోటలు మఱికొన్ని గలవు. అందు ‘సంతోషసదన' మని యర్థమిచ్చుచు ఔంగ జేబు పట్టాభి షేకమునకు స్థానమయి చెలువొందిన షాలిమరు తోటయును, రాణితోట వేయించిన జహనారా బేగము సోదరియును ఔరంగా జేబు పక్షువ ర్తియు నయిన రోషనారావలన వేయఁబడిన రోష