పుట:Delhi-Darbaru.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఢిల్లీ న గ ర చరిత్రము.


లోహస్తంభమని నతోడనే, మాచదువరు లద్దాని స్మరియింపఁ గలరు. హైందవ సామ్రూజ్య కాలమందు క్రీస్తుశకమునం దైదవ శతాబ్దమున. ఢిల్లీని వీక్షింపఁబోవు ప్రవాసికులందఱును బహు కాలముగ దీనిని ప్రశంసించుచునే వచ్చుచున్నారు. కుతుబ్ మసీదు ప్రాంతమునఁ జూడవలయు ముఖ్యతమమగుఁ జిత్ర ములలో ఒక్కటియ , పెర్గుసను వ్రాసియు న్నాఁడు. ఇది యిప్పుడుభూమిపై నిరువది రెండడుగుల యెత్తు న్నది. భూమిలోనుండు భాగము 20 అంగుళములు మాత్రమే యని మనకు విస్పష్టముగఁ దెలిసియున్నది. కావున మొత్త మున అద్దాని పొడవు 23 అడుగులు 4 అంగుళములు. పీఠమున దీనిచుట్టుకొలత 164 అంగుళములు; శిరోభాగమున 12.08 అం గుళములు......క్రీ! శ|| 363 లేక 400 ప్రాంతము లందలి గుప్త వంశజులగు చంద్రరాజుల కాలమున నియ్యది నెలకొల్పఁబడె నని నా నమ్మకము. క్రీ! శl 400 సంవత్సరమున నిది స్థాప్పిపఁబడె ననుకొనినను మనమిదివఱి కెప్పుడు నూహింపనైన నూహింపని యంశ మొక్కటి బయలుపడుచున్నది. నిన్న నేఁటివఱకును నైరో పాఖండవాసులు నిర్మింప నేరక యిటీవల ఒకటి రెంటిని మాత్రము నిరింప గలిగిన స్తంభజతిలోఁ జేరిన ఈ లోహ స్తంభమును హిందువు లంత ప్రాచీనకాలముననె పోతపోసిరనుట విశదమగు చున్నది... ఇంతియెగాదు. పదునాలుగుశతాబ్దములు వర్షమున కును వాయువునకును దలమొగ్గి యీ యినుప కంబము రవ్వంత