పుట:Delhi-Darbaru.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఢిల్లీ న గ ర చ ి త్రము.


కీ. శ. 1857 న సంవత్ససంపూర్ణముగ మహారాష్ట్రుల స్వాధీన మాయెను. కొంత కాలము ఢిల్లీ కై పోట్లాటలు జరిగెనుగాని 1788 లో మహారాష్ట్ర సైన్యము బాదుషాహనగరున స్థిరముగ స్థాపింపఁ బరెను.పదునారు సంవత్సరముల కాలమీమహారాష్ట్ర వీరు లేక చ్ఛత్రాధిపత్యముగ నుత్తర హిందూస్థానమునంతయు "నేలిరి.క్రీ! శ! 1803 లో లార్డు లేకు ఢిల్లీ యుద్ధమున వీరినోడించి నగరము నాక్రమించుకొని యదివఱకు బొత్తిగ సంతరింపక నామావ శేషుఁడై యుండిన రెడవషాఆలం బాదుషాహనుదన సంరక్షణమం దుంచుకొనెను. క్రీ.శ.1857వ సంవత్సరమున జరిగిన సైనికుల తిరుగుబాటు వఱకును నాంగ్లేయులు బాదుషాహ పేరుతోడనే ఢిల్లీ నేలుచుండిరి. ఆమహాక్షోభ కథ యిట వ్రాయు టనవసరము. దానిని బ్రిటిషునా రణచుటయందు విజయులై తమ చేతినుండి యూడి పోయిన ఢిల్లీని మరల వశపఱచుకొనిన తోడనె బాదుషాహ నామమును దుడిచివైచిరి. కొంత కాల మాపట్టణమును "సైనిక పరిపాలన(Military Government) క్రింద నునిచిరి. బ్రిటిషు భటుల నేకులు చంపఁబడుచు వచ్చినందున ఢిల్లీ పౌరులందరును బట్టణమునుండి నెడలఁ గొట్టఁబడిరి. కాని యచిర కాలములో నే హిందువులును, 1858 సంవత్సర ప్రారంభమున మహమ్ముదీయులునుఁ జేర గలిగిరి. అప్పుడె సైనిక రాజ్యాంగము వోయి దివానీ పరిపాలన (Civil Government) ప్రారంభమా