పుట:Delhi-Darbaru.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

దర్బారుల చరిత్రము.


రాజసూయంబు సేయ " నుపక్రమించెను. సహ దేవుఁడు సర్వ సన్నా హములును జేయ నియోగింపఁబడెను. యజ్ఞోపకరణ తతులు సిద్ధమాయెను. సర్వసంభారములు నిండిపోయెను. ఇంద్రప్రస్థంబు చుట్టును సకలదిక్కులను అపార భూరిబహువిధా గారములును ప్రమదవనములును వెలయ నాపురమపర భూతల మయియె ప్పెను. ధర్మ తనయుఁడు క్రతుదీక్షవహించెను. భూ పాలకులందజుఱును వివిధోపాయనములు దెచ్చి యతని శ్రీపాద ముల కెఱఁగిరి.

ఇదేవిధమున నశ్వమేధయాగ సమయమున

విద్వత్సమూహంబు వివిధ దేశాధీశ, సంఘంబుఁ గార్యవిచారపరులు
నష్ట నాదికృత్యంబుల వారలు, బహు పరిచర్యలఁబరఁగుజనులు
వైశ్య ప్రముఖ పౌర వర్గంబులును ముఖ్య, హాలికాది జానపదావలులును
వైణిక గాయక వాంశికొదివి చూద, కమలును వారసుందరులులో ను
గాగ నేగుదెంచి కాంచి యవ్విభునిస
త్కారములఁబ్రమోదితంబులగుచు
భావములుద లిర్ప సేవించియుండన
క్కొలుపుసాల నెప్పె చెలువు మెఱ సెన్.

తదనంతరము యమనందనుఁడు మురారియు నానాపృథి వీశ్వరులును వెంటరాఁగ, ద్రౌపది ఓషధులుగొనిన డువఁ దావన కోటి మంత్రములు పఠింపుచుండ, నాఱు వృషభములను బూన్చిన మేటి నాగటితో నధ్వరభూమిని దున్ని సిద్ధము చేసెను.