పుట:Delhi-Darbaru.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

345


గర్తవ్యము. పన్ను వసూలున కతఁడేర్పఱచిన మార్గము ముందు కాలమున బాధను దెచ్చి పెట్టునదయ్యెను. అతఁడు అమల్దారుల నేర్పఱచి వారిని తాలూ కాలకనిపి నిర్ణీతమగు మొత్తమును నసూలు చేయవలసినదని యుత్తరువిచ్చును. వారు తక్కువ వసూలు చేసినచో స్వంతధనమచ్చుకొని తీరవలయు 'ననియు ఎక్కువవసూలు చేసినచో రాజుగారి ధనాగారమునకను పనలసినదనియు వారికి నను. ఈ పద్ధతి దీవాను స్వయముగ జాగరూకుఁడయి న్యాయమతి భ్రమింపక కార్యములను గమనిం చినంత కాలమును దుఃఖములను దెచ్చి పెట్టదయ్యెను. కాని రాజునకుఁ బైకము కానలసినచ్చినప్పుడును దివాను కఠినుఁడయి నప్పుడును దీనివలన సనర్థములు జరుగవీలుం డెను. అట్టి కష్టదశ ముందు వర్ణితమగును. పూర్ణయ్య నిరంకుశముగ పరిపాలించే నని పైన వ్రాసితిమి. ప్రజలకుమాత్రమె అతఁడు నిరంకుశుఁడు గాఁడు. రాజు విషయమునగూడ నతఁడు అట్టి విధముగ నే ప్రవ దించుచుండెను. కావునఁ జుట్టుముట్టుంగల పరిజనుల బోధన లచే రాజునక తనిపై నసూయజనిం చెను. అందువలన కృష్ణ రాజు ఒడయరు 1811 వ సంవత్సరమున నాంగ్లేయ ప్రభుత్వము వారికిఁ దానే రాజ్య భారము నిర్వహించుకొందునని తెలియఁ జే సెను. రెసిడెంటు పూర్ణయ్యను దివానుగానిలుప నెం చెనుగాని అతఁడియ్యకొనఁడయ్యెను. ఆ తరువాతి సంవత్సర మే శ్రీరంగ పట్ట ఇమున పూర్ణయ్య వైకుంఠ ప్రాప్తిఁ జెందెను.