పుట:Delhi-Darbaru.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

మైసూరు రాజ్యము.


సేనానాయకుఁడుగ నేమింపఁబడెను. ఇట్లేర్పడిన ఈమువ్వురి చేతులలో మైసూరు రాజ్యము క్షేమముగ జీవయాత్ర మొదలి డెను. అచ్చటచ్చట తిరుగఁబడియుండిన ప్రభువు లణఁచి వేయఁ బడిరి. దేశములోని సంగతులన్ని యును జక్కఁగ నెఱిఁగిన వాడుగాన పూర్ణయ్య రాజ్యములోని వరుంబడి మార్గముల బాగుగ నుపయోగింపఁ జొచ్చెను. టిప్పుసుల్తాను మంచిగంధపు చెక్క ఎగుమతి కాకూడదని ఉత్తరువు చేసియు డెను. కావున రాజ్యభవనములలోనది కొల్లలుగఁ జేరియుండెను. తెలిసిన వాడుగాన పూర్ణయ్య దానిని అమ్మి ఎక్కుడు ధనమును బొక్క. సమునకుఁ జేర్చెను. ఇతఁడు రాజ్య భారము నిర్వహించి నంత కాలమును ఆంగ్లేయ ప్రభుత్వము వారు మైసూరు పరి పాలన యందు జోక్యముకలుగఁ జేసికొనవలసిన యంశ మొక్కటి యును రా లేదు. దీని చే పూర్ణయ్య ప్రభుత్వమున లోపములు "లేవని చెప్పుటగాదు. కానిపూర్వపద్ధతుల నవలంబించుచు నిరంకుశముగ రాజ్యపాలనము చేసినను అతని కాలమున నేలాటి కష్టములును దటస్థింపకుండుట ఆతని పరిపాలనా శక్తిని వ్యక్తి కరించుచున్నదని మాత్రము అందఱకును దోఁచకపోదు. అతఁడు 1811 న సంవత్సరములోపల బొక్క సమున రెండుకోట్ల రూపాయలు చేర్చి పెట్టెనసినచో నతఁడు ఆర్థిక విషయముల “నెంత జాగరూకతతోఁ బనిచేసినదియు "నెల్లడియగుచున్నది. అతని పద్ధతులలోని ఒక్కలోపమును మాత్రమిచ్చటనె చూపుట