పుట:Delhi-Darbaru.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్ణ య్య.

313


జేరిన వాఁడు. హైదరుకాలమున నతనికడ ఇతఁడు పనికికుదిరి సామర్థ్యము చూపినందున ఇతఁడు ఆతనిచే మంత్రిగ నేమింపఁ బడియెను. హైదరాలీ ఆంగ్లేయుల పై యుద్ధమునకు బయలు దేరి నప్పుడు అతని సైన్యములకు వలయు సామగ్రినంతయు వెంట నడపి తన యజమానికి ప్రబలసాహాయ్య మొనర్చినవాడీ పూర్ణ య్య యే. హైదరు మరణానంతరము టిప్పూను బారదోలి హైదరు రెండవ కుమారుని సింహాసనారూఢుం జేయ వలయునని ప్రయత్నించిన వారిని విఫలమనోరధుల నెనర్చి టిప్పూసుల్తాను నకు మైసూరు రాజ్యమును దక్కించినవాఁడును ఈపూర్ణయ్య యే. కావున నితఁడు హైదరునకును టిప్పునకును మిక్కిలి ముఖ్యుండుగ నుండెను. టిప్పు యొక్క మతావేశము ఇతని వఱ కును వ్యాపిం చెనుగాని అతని తల్లిగారి హెచ్చరిక మీఁద టిప్పు పూర్ణయ్య గారియొద్ద మతపుమాటయె యెత్తుకొనుట మాని వేసెను. శ్రీరంగపట్న పుముట్టడిలో టిప్పు నిహతుఁడయిన పిదప ఇతఁడును ఆంగ్లేయుల చేతులలోఁ జిక్కెను. కాని టిప్పుసుల్తాను కడ నెర వేర్చుచుండిన ఆర్థికమంత్రిత్వ కార్యమునే కృష్ణ రాజఒడ యరు కడఁగూడ నెర వేర్ప నియ్యకొనుటవలన నాంగ్లేయ ప్రభు త్వమువారు పూర్ణయ్యను ఉద్యోగమునందుండ నియమించిరి. పూర్ణయ్యదివానుగను రాజ్య పాలకుఁడుగను నేర్పఱుప బడెను. కర్నలు క్లోసు అనునతఁడు రెసిడెంటయ్యెను. కర్నలు ఆర్తరు వెల్లస్లీ (తరువాత వెల్లింగ్టను ప్రభువయి నెగడిన వాఁడు)