పుట:Delhi-Darbaru.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టి ప్పూ సు లా ను.

339


దుండిన తిరువాన్ కూరు రాష్ట్రము నితఁడు ముట్టడింపఁబోయెను. కావున నాంగ్లేయ ప్రభుత్వము వారికిని ఇతనికిని మఱల విగ్ర హము . ప్రారంభమాయెను. మహారాష్ట్రులును నైజామును అంగ్లేయులకు సాయ మే తెంచిరి. గవర్నరు జనరలుగా నుండిన లార్డు 'కారన్ వా లీసే స్వయముగ సైన్యముల నడపుకొని నచ్చెను. కొంత పోరాటముమీఁద టిప్పూ పరాజితుఁడయి శ్రీరంగపట్నము నద్ద సంధి చేసికొనెను (1792). దానివలన నతని రాజ్యములో సగబాలును మూఁడుకోట్ల ముప్పది రూపా యలును శత్రువులకుఁ జెందిపోయెను. అతని కుమారులిరు వుకు ప్రతిభులుగా 'మెసంగఁబడిరి.

ఈ దురదృష్టమునకుఁ దరువాత టిప్పూ ఆంగ్లేయుల నెటైనను భరతఖండమునుండి పారదోలవలయునని బహు భం గుల ప్రయత్నము చేయ నారంభించెను. ఆఫ్ఘనిస్థానము, తుర్కీ, అ రేబియా, పారసీక ము మున్నగు మహమ్మదీయ విదేశములకు ఉత్తరములు వ్రాసెను. ఢిల్లీ, అయోధ్యా, హైదరాబాదు, పునహా, యోధపురము,జయపురము, కాశ్మీరము మున్నగు భార తేయ సంస్థానములకుఁ దన ప్రతినిధుల నం పెను. ప్రెంచి వారిని పలుమారు సాహాయ్యము వేఁడెను. వారికి నాయకుఁ డయి యైరోపాఖండము నంతయు వడంకఁ జేయుచుండిన నెపోలియను బోనపార్టునకును ఇతనికి గూడ ను త్తర ప్రత్యు.