పుట:Delhi-Darbaru.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

మైసూరు రాజ్యము,


యుండెను. కాని మహారాష్ట్రులు దనుకు వచ్చిన కష్టములు దప్పించుకొన పాటుపడుచుండిరి. గవర్నరు జనరలుగారి సామ వాక్యముల చేతను చాతుర్యముచేతను నైజాము ఆంగ్లేయుల పరమయి హైదరును చేరఁడయ్యెను. కావున ఇతనికిని ఆంగ్లే యులకును జరిగిన విగ్రహము మహా ఘోరమయ్యెను. హైద రాంగ్లేయులను ఆంగ్లేయులు హైదరును ఓడింపఁ జొచ్చిరి, ఇట్లు హైదరు జయాపజయములను గొనుచు దీక్షతోఁ బని చేసి ఆంగ్లేయులతో రెండుమారులు విగ్రహము నడిపి మైసూరు సంస్థానమునకుఁ గొఅంతరాకుండునట్లు నిలిపి 1782వ సంవత్సర మున రెండవ మైసూరు విగ్రహము జరుగుచుండఁగ నే మృతి నొందెను.

టిప్పూ సుల్తాను.

హైదరు మరణానంతరము అతని కుమారుఁ డైన టిప్పూ సుల్తాను రాజ్యమునకు నచ్చేను. ఇతఁడు విద్యావంతుఁ డేగాని మతా వేశ ముగలవాఁడు. 1784 సంవత్సరమున ఆంగ్లేయులతో సంధి చేసికొని మహారాష్ట్రులను నై జూమును జయించి ఇతఁడు దక్షిణ హిందూస్థాన పశ్చిమ తీరమునకు దండెత్తిపోయి రాజ్య ముల నాక్రమించి అందలి ప్రజలను మహమ్మదీయులు గావల సినదని నిర్బంధ పెట్టఁ బ్రారంభిచెను. వారట్టి పని కంగీకరింప నిచో వారిని చిత్రవధపాలు చేయుచువచ్చెను. ఇంతియె కాదు. ఇతనికిని ఆంగ్లేయులకును బద్ధవైరము. వారి సంరక్షణయం