పుట:Delhi-Darbaru.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైదరు ప్రభుత్వము.

337


తీరమందలి పురమును బట్టు నుద్దేశముతో పంపఁబడెను. కాని “మాహీ' హైదరునకు లోఁబడిన ఒక సామంత రాజు దైనందు నను హైదరు రాజ్యములో నుండి పటాలములు పోవలసి యున్నందునను హైదరు 'మాహీ' పైఁ దనధ్వజమును ప్రేంచి వారి ధ్వజముతోఁగూడ నెక్కించి ఆంగ్లేయులు “మాహీ' వం కకుఁ బోకూడదని శాసిం చెను. కాని ఈతఁడొడ్డిన యాటంకము నిలచినది కాదు. 'మాహీ' ని ఆంగ్లేయులు పట్టుకొనిరి. దీని వలన - హైదరునకుఁ గలిగిన ఆగ్రహమును వర్ణింప నలవిగాదు. ఆ సమయముననే నైజామునకును ఆంగ్లేయులకును గుంటూరు సర్కారు విషయమున భేదములు ప్రారంభమయ్యెను. ఉత్తరహిందూస్థానమునను బొంబాయియందును ఆంగ్లేయులకు దుర వస్థలు వాటిల్లుచుండెను. కావున నారు హైదరును శాంత పఱచుటకు అనేక విధములఁ బ్రయత్నించిరి. మధ్యనర్తులనంపి చూచిరి. బహుమతు లిచ్చి తనియింప నెంచిరి. ఎన్ని పాట్లుపడి నను హైదరు వారిని మన్నించిన వాఁడు గాఁడు. అతని ఏర్పాటు లన్ని యుఁ దీరినతోడనే 1780 వ సంవత్సరమున డెబ్బదీ ఎని మిదేండ వయస్సున నతఁడు కుల వైరుల నిర్దూలము చేసెదనని పట్టుపట్టిన యావనుఁడగు కుమారునితోఁ గూడ 90,000 సైన్యమును నడపికొని ప్రజల సంపూర్ణాశీ ర్వాదములఁ గొనుచు సమర్ధులగు నధికారులు గొలువ నాంగ్లేయులమీఁద వెడలెను. నైజామును మహారాష్ట్రులును నితనికి సాహాయ్యము రానేర్పడి