పుట:Delhi-Darbaru.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

మైసూరు రాజ్యము.


మున ఔరంగ జేబుతోడను మిక్కిలి మైత్రి సంపాదించి బెంగు భూరునుకొని మొగలాయీలకు నష్టముగాని మార్గములఁ దన రాజ్యమును వ్యాపింపఁ జేసికొనఁ గడంగెను. మొదటి సంవత్స రమున తుంకూరును, బారహలు సేలములలో నెక్కుడు భాగమును ఇతని స్వాధీనమయ్యెను. 1690-1694 ల లోపల బశ్చిమమున బెడ్నూరు ప్రభువు భూములను బాబాబుడ పర్వతములవఱకును నితఁడు వశపజచుకొ నెను. 1694 న సం నత్సరమున నతనితో సంధి చేసికొని అందు కొద్ది భాగము మాత్ర మతనికి నిచ్చి వేసెను.

1696 వ సంవత్సరమున చిక్క దేవరాజు మథుర నాయ కుని పైకి దాడి వెడలి తిరుచినాపల్లిని ముట్టడించెను. అయిన మహారాష్ట్ర సైన్యములు సమయము కనిపట్టి తన రాజధాని పై కెత్తి వచ్చుటవలన నీతఁడు తిరుచినాపల్లి ముట్టడిని వదల్చ వలసిన వాఁడయ్యెను. 1697 లో ఔరంగ జేబు కొలువున చిక్క దేవరాజు స్నేహితుఁడుగనుండిన ఖాసింఖానుఁడు గతించి పోయెను. అందువలనఁ దాను నవీనముగ గడించిన భూభాగ ము పైఁ దనహక్కు- స్థిర పఱచుకొను నుద్దేశముతో చిక్క దేవ ఢిల్లీకి రాయ బారమం పెను. పాదుషాహ రాయబారులకు అహమ్మదు నగరమున నే కానవచ్చినందున వారతండీయ తమ ప్రభువునకొక నూతనముద్రయు, జగ ద్దేవ రాజను బిరుదమును, దంతపు సింహాసనము నధిష్ఠించి కొలువుండుట కు తరువును