పుట:Delhi-Darbaru.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిక్కదేవరాజు.

327


దీనినంతయును గనిపట్టి చిక్క దేవ రాజు జంగమాచార్యులను నాలుగువందలమందిని తనతో సంభాషించి పోవుట కై కొలువు కూటమునకుఁ బిలుపించిన పగిది' పిలువంబంచి కొలువుకూట మునకు వెనుక ప్రక్కన ఇతరులకుఁ దెలియ రాకుండ పెద్దగోతి నొకదానిని దీసి యటహంతకుల నేమించియుంచి యప్పటి యాచారమున కనుగుణముగ రాజుతోఁ బ్రసంగించి వెనుకటి భాగమునకు జగము లొక్కడొక్కఁడుగ విందారగించు కుతూహలమునఁబోవ వారిని ఒక్కని తరువాత నొక్క-నిగఁ జంపించివేసెను.

ఈవిధమున నతి క్రూర - సాహస మొనర్చి అతఁడప్పటి యసంతుష్టిని మరల్పఁ గలిగెను. కాని యాతని మంత్రియే యింతటి కార్యములకుఁ గారకుఁ డని యెంచి ప్రజలతనిసయి విరోధమూని యొక కుట్రపన్ని అతనిని మడియించిరి. ఆతఁడు ప్రాణములు వినుచుచు తిరుమల అయ్యంగారు అను వానిని తన ప్రభువునకు సిఫార్సు చేసెను. చిక్కదేవరాజు మంత్రిమరణ మునకు మిక్కిలి వగచెనని వేరుగ వ్రాయవలసిన పని లేదు.

ఇప్పటికి మొగలాయి చక్రవర్తులు విజాపురము నాక్ర మించుకొని (1687) దానికి లోబడియుండిన కర్నాటక భాగ ములను స్వాధీనము చేసికొన నారంభించి యుండిరి. శ్రీరామండ లము ఏర్పడఁ జొచ్చియుండెను. చిక్కదేవ రాజు శ్రీ రామండల మున ప్రతినిధిగ నేర్పడిన ఖాసింఖానునితోడను అతని మూల