పుట:Delhi-Darbaru.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంఠీరవ నరసింహుఁడు.

323


ర్తించి 1630 వ సంవత్సరమున చెన్న పట్టణ భూములను వశపఱ చుకొని మైసూరు రాజ్యమునకు జగదేవరాయని పొలము లన్ని టినిఁ జేర్చి వేసెను.

కంఠీర వనరసింహుఁడు.

ఇతనికిఁ దరువాత ఇమ్మడి రాజు రాజ్యము నకు వచ్చెను గాని అతఁడు విక్రమరాజను మంత్రివలన విషముచేఁ జంపఁ బడెను. బెట్టద శ్యామరాజ ఒడయరు కుమారుఁడు కంఠీరవ నరసరాజు రాజ్యమునకు నిర్వచింపఁ బడెను. కాని మంత్రి విక్రముఁ డుమాత్ర మాతనికిఁ బట్టాభి షేకము చేయ కుండెను. అయిన నితఁడు బుద్ధిశాలియు బలవుతుఁడును నై నందున విక్రముని చర్యలను కనిపట్టి వానిని తన మనుష్యుల చేఁ దుదముట్టించి స్వతంత్రముగ రాజ్యభారము వహించెను. ఇట్లు సింహాసనము నెక్కిన కంఠీరవనరసరాజు మహాపరాక్రమ శాలి. ఈతనికాలమునకు బిజాపుర సంస్థానము 'బలవంతమయి యుండెను. అహమ్మదు నగరము 'మొగలాయీల వలన నశింపఁ జేయఁబడినందున ఢిల్లీ బాచుపాహకు లోఁబడినదే యయినను విజాపురము మాత్రము దక్షిణ హిందూస్థాన ములలో మిన్నయై వెలుంగుచుండెను. అట్టి విజాపురపు దండులు రండుల్లాఖానుఁడును శ్రీశివాజి తండ్రియైన పాజి యును నడుప శ్రీరంగపట్న ముమీఁదికి ఎత్తివ చ్చెను. కంఠీరవ నరసింహుఁడా బలముల నెదిర్చి చెండాడెను. దీనికిఁ దరువాత