పుట:Delhi-Darbaru.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

మైసూరురాజ్యము.


స్వీక వివాహమునకు సకల సన్నాహములును జరుగుచుం డెను. ఆ గ్రామ సమీపమునకు నచ్చియుండిన ఈ విజయ కృష్ణు లిరువురును విషయము లెల్లయును విని హదినాడువారికి సాహాయ్యము చేయ నియ్యకొని మాయోపాయమున కారుగహళ్లి ప్రభువు పైఁ బడి అతనిని మడియించి అతని గ్రామ మును స్వాధీనము చేసికొనిరి. హదినాడు ప్రభువునకు పుత్రిక తమ వంశమునకు రక్షకులయియేఆంచిన' ఈ విజయకృష్ణు లకుఁ గృతజ్ఞురాలయి విజయుని వరించెను. కారుగహళ్లి హది నాడులు రెండును విజయుని సొమ్మయ్యెను. అప్పుడతఁడు “ఒడ యరు' అను బిరుదమును ధరించి లింగాయతమతమును రించెను. ఈతనివంశీకు లే నేఁటికిని మైసూరు సుస్థానము నేలు చున్నారు. ఇతనినుండి నేటివఱకును రాజ్య మేలిన వారి నామ ముల దెలుపు పట్టిక యొకటి మైసూరు సంస్థానము వారి చే సిద్ధ' పుషఁబడియున్నది. దాని నీ క్రిందఁ బొందుషఱ చితిమి.


యదురాయఁడు విజయుఁడు క్రీ. శ.
హిరేబెట్టద శ్యామరాజ ఒడయరు 1423-1458
తిమరాజ ఒడయరు ! 1458_1478
ఆకు బెరళుహిగేశ్యామరాజ ఒడయరు !! 1478_1513
బెట్టదశ్యామరాజ ఒడయరు III1513_1552
తిమ రాజ ఒడయరు II (అప్పన్న)1552_1571
బోళ శ్యామరాజ ఒడయరు IV 1571.1576