పుట:Delhi-Darbaru.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హోయి సణులు.

311


మును ప్రకటించుచున్నది. ఇతఁడు క్రీ|| శ|| 1047 మొదలు 1100 వఱకును ఏబదిమూఁడు సంవత్సరములు రాజ్య మేలుటవలన నితని కుమారుఁడు బహుకాలము యువరాజు పట్టమును ధరించి యితనికంటె ముందు పరలోకప్రాప్తి జెందెను. అయిన నీ యువరాజు చాళుక్యులకు కుడిభు జముగనుండి చోళమాళవ కళింగులను ఓడించి అరిభయం కరుఁడయి ప్రవర్తించినట్లు నుడువ బడియున్నది. కావున వీరికిని చాళుక్యులకును అన్యోన్య మైత్రియుండుట గాక వీరు గొంత రాజ్యము సంపాదించిన తరువాతఁ గూడ చాళుక్యులకు విడువరాని సహాయులుగ నుండిరని తేలుచున్నది.

వినయాదిత్యుని మరణానంతరము అతని ముగ్గురి మను మలలో నిద్దజుబహుస్వల్ప కాలము రాజ్యభారము వహించిరి. వారికిఁదరువాత ' నందు రెండవ వాఁడును దక్కిన వారు'పోఁగా బ్రతికియున్న వాఁడును నైన బిట్ట దేవుఁడు ప్రభుత్వమునకు వచ్చె ను. ఇతఁడును చాళుక్య నృపతుల సైన్యములలోఁ బేరునందిన వాడే. ప్రసిద్ధినొందిన చాళుక్య విక్రమాదిత్యుఁ డీతనిని గుఱించి “హోయిసణుఁ డొక్కఁడె అజేయుఁడగు రాకొమరుఁడు గాఁ గలఁడు' అని తీర్మానముగఁ బల్కియుండెనఁట! ఈ వాక్కునకను గుణముగ బిట్ట దేవుఁడు దిగ్విజయముఁ జేసి తన ప్రభుత్వమును తల కాను, కొంగు, నంగలి, గంగదొడి, నొలంబవాడి, మాసవాడి హుళి గేరి, హళసిగె, వనవాసి, హనుంగల్ అనునీ మండలము