పుట:Delhi-Darbaru.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క ళచుర్యులు

309


యుండిన కళ చుర్యవంశపు వాఁడగు బిజ్జలుఁడు దన ప్రభువు పై బడి యతని రాజ్యము నాక్రమించుకొనెను. ఇంతటితో చాళు క్యశక్తి నామావ శేషమై పోయెను.

కళచుర్యులు.

కళచుర్యు లిరువదియారు సంవత్సరములకంటె నె క్కుడు కాలము రాజ్యభారమును సహించ లేదు. లింగాయత మతము బిజ్జలుని బావచరంది యగు బసవని చే స్థాపనముందు టయు జైనమతమునకును దానికిని వివాదములు పుట్టుటయు మున్నగు విషయములన్నియు నీకళచుర్యుల కాలమున నే తట స్థించుట వలన వీరి వంశమునకుఁ గొంచెము ప్రాముఖ్యత గలిగి నది. వీరిని 1183న సంవత్సరమున హొయిసణులు మ్రింగి వేసిరి.

హాయిసణులు.

కదంబుల వంశమువలెనె హోయిసణవంశమును మైసూరు దేశము జన స్థానముగఁ గలది. హాయిసణులు తాముయాదవుల మని చెప్పుకొనియెదరు. దాని వలన నె వీరు చంద్రవంశము వార యినట్లు ప్రతీతి. వీరి మూలపురుషుని గుఱించి యొక. కథగలదు. ప్రస్తుతము ముద్దెరి తాలూకాలో పడమటి కనుమల ప్రాంత మున నంగడియను గ్రామముండు స్థానమున శశకపురముండెడిది. సణుఁడను వాఁడు ఆ గ్రామ సమీపమున నటవియం దాలయమున దమ కుల దేవతయగు వసంతికను ఒక నాఁడు పూజింపుచుండ నతిరౌద్రాకారము వహించిన యొక పులియతని వంకకు