పుట:Delhi-Darbaru.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

మైసూరు రాజ్యము.


జనులు ధైర్యవంతులుగ నుండిరి. వారు సూనృతపరులై నిష్కపటులుగ నుండి విద్యలయం దాసక్తిగల వారుగనుం డిరి. 10,000, బౌద్ధమతాచార్యులును, : 80 బ్రాహణ దేవా లయములును అనేకులు జైన నిర్గంథులును నుండిరి. ఇట్టి రాజధానిగల పల్లవులను 733 లో ' చాళుక్యులలోని రెండవ విక్రమార్కుడు మహాయుద్ధమున నోడిం చెను. నాఁటినుండి పల్లవుల బలము విచ్ఛిన్న మయ్యెను. అట్లుండియు వీరు 'నోలం బు'లను పేరుతో మైసూరు నందు పదియవశ తాబ్దము చివర దను కను రాజ్యభారము సహించి అప్పుడు దక్షిణ హిందూస్థాన ములోని పూర్వభాగము నంతయును ఆవరింపఁ జొచ్చియుండిన చోళులకుఁ లోఁబడి పోయిరి.

పల్లవులును వారి శాఖయగు నీనోలంబులును చాళుక్యు లకును చోళులకును సామంతులుగఁ. దరువాతి కాలమునఁ గానవచ్చచున్నారు.

గంగులు.

కదంబుల తోను పల్లవులతోను రమారమి సమకాలికులుగ మధ్యమైసూరును దక్షిణమైసూరును ఏలుచుండిన వారు గంగులు. వీరు త్తర దేశమున గంగాతీరమునందుండి వచ్చిన జాతి వారనుట కేమియు సందేహము లేదు. ఈజాతివారే గంగా ముఖమునఁ గొంత ప్రదేశమును చంద్రగుప్తుని సామంతులుగ నేలుచుండిరి. ఈశాఖ వారే కళింగమునుగూడఁ గొంత కాలమేలి రనుటకు