పుట:Delhi-Darbaru.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురాణ ప్రసిద్ధమగు చరిత్రాంశములు.

289


రామాయణమునందు కిష్కింధ వానరధ్వజ రాజ్యమని పిలువఁ బడియున్న ది. దానియం దా రాజ్య చరిత్ర బాగుగ నియ్యఁబడినది. . అదెల్లయు నిచట వ్రాయు టనవసరము. దానిననుసరించినచో మైసూరున పశ్చిమో త్తరభాగము - రామాయణ కథలో ననే కాంశములకు పట్టుగనుం డెనని తేలుచున్న ది. భారత కథయందును మైసూరు ప్రదేశము ప్రాముఖ్యత నందియున్నది. అర్జునుఁడు తీర్థయాత్ర సలుపు నపుడుమ హేంద్ర పర్వతముల దాఁటీ మణి పురమును జొచ్చి అచ్చటి రాజు కూఁతును చిత్రాంగదను బెండ్లియాడి మూఁడేండ్లు వసించి బభ్రువాహనుఁ డను కొడుకును బడ సెనని చెప్పఁబడియున్నది. ఈమణి పురము శ్యామరాజు నగరమునకు సమీపమున నున్నట్లు నుడువఁబడు చున్నది.* దిగ్విజయసమయమున సహ దేవుఁ డు దక్షిణము పై దాడి వెడలి కిష్కింధను దాఁటి కావేరికడ కేగి మాహిష్మతీ రాజగు నీలుని జయించుచున్నాఁడు. ఈమహిష్మతి మైసూరనియే చెప్పవలసియున్నది. అటనుండి అతఁడు సహ్యాద్రుల మార్గమున కొంకణ, గౌళ, కేరళ రాజులను వశవర్తులఁ జేసికొనెనని నర్ణించుటవలన ! నీయూహకుఁ గొంచెము దార్డ్యముకలుగు చున్నది. కన్నడభాషయందుఁగల జైమినీ భారతమున మేధయాగ వర్ణనలో , బేర్కొనఁబడిన కొన్ని ఫలములును ..........................................................................................

  • బంగాళమునందలి మణిపురము బభ్రువాహనుని దనుచు న్నారట

గానిభారతమందలి వర్ణనలను బట్టి అదికాఁజాలదు .

19