పుట:Delhi-Darbaru.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

మైసూరు రాజ్యము.


మహిషాసురుఁడు చాముండీయందును ప్రబలులయిన ట్లూహింప వలసి యున్నది.

పరశురాముని జనాదికములకు గూడ మైసూరు భూమియే సదనమనుటకు నిదర్శనములున్నవి. జమదగ్ని సురభికి యజ మాని యనుటయు,, రేణుక తన మగనితోడ నగ్ని నిప్రవేశిం చుటయు, కార్తవీర్యుఁడు చంపఁబడుటయు, కస్యపుడు కుత్రియ "శేషమును గా పాడుటకయి పరశురాముని సముద్రతీరమునకు "వెడలిపొమ్మని శాసించుటయు, పరశురాముఁడు సగరుని వేడి సత్తకొంకణముల సంపాదించుటయు మున్నగు విషయముల సూచించుటకు సురభితాలు కాయును, చంద్రగుత్తిలోని రేణుక దేవాలయమును, కోలారునందు కొల్లాలమ్మగుడియు, తీర్థహళ్లి యును, సాగరను తాలూకాయును, హీరేమాగ ళూరులోని పరశు దేవాలయమును, హి రేమాగళూరునకుఁ బూర్వనామ మగు భాగ్గవపురియును చాలియుం డునని ‘రైస్' అను చరిత్ర 'కారుఁ డూహించుచున్నాఁ.డు.

రామాయణ కథ ననుసరించి కిష్కింధ వదలి శ్రీ రాముఁడు దక్షిణాభి ముఖుఁడై లంక కుఁదరలుట మన మెఱిఁగి నదె. కిష్కిధలో నిదగు పంపా సరోవరము తుంగభద్రాతీరమం దలి సుప్రసిద్ధమయిన విజయనగరముగదా. అచ్చటినుండి దక్షిణమున కేగుటకు మార్గము మైసూరు సంస్థాన భూమి ద్వారా యయి యుండవలయుననుటకు సందియము లేదు. జైన