పుట:Delhi-Darbaru.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

బ రోడా రాష్ట్ర ము.


కావున సర్ మాధవరావు న్యాయమునకును చట్టములకును వ్యతి రేకముగాని తెఱంగున వీరిని జమీనులనుండి విడదీయు మార్గమును ఆరయవలసిన వాఁడయ్యెను.

ముందు సంవత్సరములలో నీసర దారులు రాజుగార డిగి నప్పుడు ద్రవ్య సాహాయ్యము చేయక ఎగఁగొట్టఁ బ్రయత్నించి యుండిరి. ఆవిషయమును స్థిరపఱచు ప్రాత కాగితముల నన్ని టిని వెదికియుంచి అవ్వానింబట్టి వారు రాష్ట్రీయ ప్రభుత్వమునకు బాకీపడిన మొత్తములను దేల్చి వెంటనే ఆ మొ త్తములను పదు నేడు పదు నెనిమిది సంవత్సరముల వడ్డితోఁగూడ కట్టవలసినదని యత్తరువు చేసెను. వారుకట్ట లేక పోయినందున వారి హక్కులు రద్దు చేయఁబడెను. అందు గొందఱు తిరుగఁబడఁజొచ్చిరి. కాని వారి మాటలు మాధన రావు కడసాగినవి కావు. ఆతని యుత్త 'రువుల ననుసరించి వారందఱును వారణాసికిఁబ్రవాసమునకుఁ గొనిపోఁబడిరి.

పేరునకు సైనికులని పిలువఁబనుచుండిన కొందఱరబ్బీలు మున్నగువారు దమ యాయుధములతో బయలు వెడలి దేశ మున కుపద్రవముగలిగించుచుండిరి. వారి దౌర్జన్యముడుపుట గూడ సులభ సాధ్యముగాదయ్యెను. అయినను మాధన రావు చాతుర్యముగ వారికి దివానీ శాఖయందు నౌక రీల నిచ్చి ఒక్క డొక్కండుగ నా సైన్యమును దగ్గించి దాని పేరైనను లేకుండ జేసెను.