పుట:Delhi-Darbaru.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు III.

267


చుండిరి. ఆసాహు కారులు సైనికుల సాహాయ్యము చేసికొని బీదలనక, ధనవంతులనక ప్రజల పై దౌర్జన్యము నడపుచుండిరి. సరదారుల యొద్దనుండి అది వఱకే ప్రభుత్వము వారు గొంత ద్రవ్యమును దీసికొని యున్నందున. పన్నులు నసూలు చేసికొను హక్కును మజల తమకే మార్చుకొనుటకు న్యాయముగాన . రాదయ్యెను. కావున సర్ మాధవరావు ఉచితమగు చట్టముల' నిర్మించి సర్దారులకుంగల పన్ను ససూలు చేసికొను హక్కులను వారు ఆమ్ముకొనవలసిన దని నిర్బంధ పెట్టెను. విశేషముగ మహా రాష్ట్రులగు నాసర్దారులు సులభమగ లోబడరయిరి.. వారికి న్యాయవాదులు సాయమయి సెక్రటరీ ఆఫ్ స్టేటు వఱకు అనఁగా ప్రీవీ కౌన్సిలు వజకు వ్యా జ్యెములు నముపఁబడునని జంకించిరి. కాని మాధవరావు పట్టినపట్టు వదలకఁ గొందఱను బ్రవాసము నకుఁ. బంపియుఁ గొంద జను మంచి మాటలతో లోబఱచు కొనియుఁ గార్యము నెర వేర్చుకొనెను.

ఇంతేగాక రాష్ట్రమున నీసర్దారుల హక్కులుగూడ విస్పష్టముగ నేర్పడియుండ లేదు. 'రాజడిగి నప్పుడు ద్రవ్యసాహా య్యముగాని సైన్యసాహాయ్యముగాని ఇచ్చుషరతు మీఁద వీరు భూభాగముల ననుభవించుచుండినందున వీటిని ఆయాజమీను నుండి విడదీయుటకూడఁ జట్టములకు విరుద్ధమయికన్పట్టెను. వీటికి జవానుల పై సర్వస్వాంతంత్ర్య, మెంత కాలముండునో అంతకాలమును న్యాయపరిపాలన కలలోనివా ర్తగనుం డెను.