పుట:Delhi-Darbaru.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు III.

265


రముల విధముగ నాతనికిని .ఆతని కుటుంబమునకు జీవనమార్గము గల్పింపఁబడెను.

1875వ సంవత్సారము. మే నెల 2వ, తేది జమ్నా బాయి బరోడాకు మగలివచ్చి ఆ నెల 27వ తేది పదుమూఁడు సంవత్స బాలుని దత్తు చేసికొనెను. ఆబాలుఁడే ప్రస్తుతము పరిపాలన 'మొనర్చుచున్న సయాజి రావు గాయికవాడు.

సయాజి రావు III. గాయికవాడు,

ఇతఁడు గాయికవాడు వంశములోని ముఖ్య శాఖలలో నొక్క దానికిఁ జేరిన వాఁడేగాని ఈతని తలిదండ్రులు మాత్రము బీదలు. రెండవ సయాజి గావు అన్న దమ్ము లందఱును మగబిడ్డలు లేక చనిపోవువఱకును ఈతని శాఖ నెవ్వరును దల పెట్ట లేదు. అయిన బరోడా రాజ్యపు మహదదృష్టమువలన జమ్నా బాయి ఈశాఖనుండి సయాజిరావును బుత్రుఁడుగ స్వీకరించెను. ఈ తఁడు దత్తు కుమారుఁడని ఏర్పడు సమయమున నే గాయిక వాడు సంస్థానమునకు సుప్రసిద్ధుఁడగు సర్. టి. మాధవరాయఁడు ముఖ్యమంత్రియయ్యెను. మాధవరాయని చరిత్రను సంక్షేప ముగ వర్ణింపవలసి యున్నది.

మాధవరాయఁడు మహారాష్ట్ర బ్రాహణుఁడు. 1828వ సం వత్సరమున జననమం దెను. ఇతఁడు మద్రాసు సర్వకళాభవన మున విద్య నభ్యసించి గణితశాస్త్రమున పట్టమందెను. కొంత కాల ముపాధ్యాయ పదముననుండి దానిని వదలి తన