పుట:Delhi-Darbaru.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

బరోడారాష్ట్రము


.

పోవు నంతలో నాతనికి విసము పెట్టఁ బ్రయత్నములు సేయఁ బడెననువార్త బయలు దేరెను. అది యట్లుండనిచ్చి ఆతఁడు మాత్రము వెడలి పోయెను.

ఆతని స్థానమున “సర్ లూయి పెల్లి వచ్చి చే రెను. దాదాభాయి మెత్తగ రాజీనామానిచ్చెను. రాజ్య కార్య నిర్వహణ మంతయును “ పెల్లి' యె వహింహిచెను. ‘ ఫేరె' కు విషము పెట్టఁ బ్రయత్నించిన విషయము విచారణకు వచ్చెను. మువ్వురు ఆంగ్లేయులును మువ్వురు స్వదేశీయులును న్యాయాధి కారసభగ నియమింపఁబడిరి. మల్హరిరావు 1875 న సంనత్స రము జనవరి 18 వ తేదీ బంధీకరింపఁబడెను. ఆంగ్లేయ ప్రభు త్వము వారు రాణీ జమ్నా బాయి పరమున గాయిక వాడు రాజ్యమును పరిపాలింపఁ బ్రారంభించిరి .

“విఅహముఁ బెట్టఁ బ్రయత్నింపు' వ్యా యోగమున మువ్వు రు ఆంగ్లేయ న్యాయాధిపతులును మల్హరిరావు దోషి యనియే తీర్మానించిరి. తక్కిన మువ్వురును నాతనిపయి ఆ నేరము మోపు టకు వీలు లేదనిరి. ఇంగ్లాండునందలి సామ్రాజ్య ప్రభుత్వము వారు మఱియొక విధమునఁ దీర్మానించిరి. మల్హరిరావు పై దోషము సిద్ధపడినదని యొప్పుకోనమని నుడువుచు నతఁడు దుర్మార్గుడై దుష్కార్యములకుఁ బూని రాజ్యమ రాజకము చేసి యుండినందున రాజ్యమున కనర్హుఁడని నిర్ధారణ చేసిరి. కావున నాతఁడు మద్రాసునకుఁ బ్రవాసమున కనుపఁ బడెను. ఉచిత