పుట:Delhi-Darbaru.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

బ రో డో రాష్ట్ర ము.


కొన్ని ప్రయత్నములు జరిగెను. కాని అవి సిద్ధించినవిగావు. ఇతఁ డు మనోపటుత్వము గలవాఁడే కాని మూర్ఖుఁడు. పట్టిన పట్టును సులభముగ వదలువాఁడు కాడు. మఱియొకరిని లక్ష్య పెట్టు వాడునుగాఁడు. తనకు వ్యతిరేకముగఁ బ్రవ ర్తించువారి యెడ బద్ధ నైరమూ నెడివాఁడు. కావున నీతనికిని బొంబాయి ప్రభుత్వము వారికిని ఎడ తెగ నివివాదములు జరుగుచు నేయుండెను. ఇతఁడు పరిపాలకుఁ డయిన వెంటనే ధాక్జి దాదాజ యనువాఁడు రెసిడెంటుగా నుండిన కా ప్టెన్ కార్నకు గారి సిఫార్సుమీదను సయాజీ యొక్క ఇష్టము మీఁదను దివానుగా నేమింపఁబడెను, కాని అతఁడు వి శేష ద్రవ్యమపహరించి సంస్థానమునకు నష్టము గలుగఁ జేసినందున "నాపదమునుండి తొలఁగింపఁబడెను. అతనికి లక్ష రూపాయిలు వేతన మేర్పఱుపఁ బడియుండెను. దానిలో ముప్పది వేలు మూఁడు ఇనాము గ్రామముల రూపముగ నియ్యం బడి యుండెను. తక్కిన పైకమిచ్చుటో లేకుండుటో నిర్ణ యించుటకు బొంబాయ గవర్నరుగానుండిన మౌంటు స్టూఆర్టు ఎల్ఫిన్ స్టన్ గారు బరోడాకుఁ బోవ నిశ్చయించిరి వారి రాక ఆ సంస్థానమున కితర విధముల గూడ నుపయోగ కారిగఁదోఁచెను.

పీష్వానామ మంతరించి పోవుటవలన ఇదివఱకు వ్రాయఃబడినరీతి గాయక వాడు ఆతని కచ్చుకొనవలసియుండిన నాలుగు లక్షలును .. దక్కించుకొని యుండెను. విగ్రహము ముగిసినతోడనే ఆంగ్లేయుల పక్షమున మాళవమున యుద్ధము