పుట:Delhi-Darbaru.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనంద రావు

249

.

గాయిక వాడు ఆంగ్లేయులకు సాహాయ్యము వలసి వచ్చినప్పుడు దన సైన్యములను 3000 స్వారులను బంప నంగీకరించెను. ఈ సంధిజరిగిన కొద్ది కాలమున కే మూఁడవ మహారాష్ట్ర విగ్రహము ప్రారంభమాయెను. ఆంగ్లేయులు పీష్వాతోడను నాగపురము రాజుతోడను సింధియా, హెల్కారులతోడను వారిపిండారీల తోడను బోర వలసిన వారైరి. అనేక యుద్ధ ములు జరిగి దేశమంతయును నల్లకల్లోలముతో. నిండియుం డెను. అట్టి సమయమున ఫతేసింగు గాయిక వాడు మహావిశ్వా సమున నాగ్లేయులకు. సాహాయ్యుడయి సాహసముతోఁ గార్యములు నెరవేర్చి ఆంగ్లేయుల విజయమునకు ముఖ్యము గఁదోడ్పడెను. ఇట్లు వారికయి యితఁడు పడినపాట్లవలన నతని బొక్కసము వట్టిదయి మఱల నప్పులు దలయెత్తెను. ఈవిగ్ర హము ముగిసి పీష్వాశక్తి మొదలంట నశించిన పిదప గాయిక వాడున కాంగ్లేయులు భూభాగము నేమియు నియ్య లేదు. అతఁ ను పీష్వాక దివఱకుఁ గట్టుచుండిన నాలుగులక్షలు మాత్ర మాతనికి లాభమయ్యెను. ఫతేసింగు 1818వ సంవత్సరము జూను మాసములోఁ బరలోక ప్రాప్తిఁ జెందెను.

అతని స్థానమునఁ బరిపాలకుడుగ నతని తమ్ముఁడు సయాజి రావు గాయిక వాడు నియమింపఁబడెను. ఆనందరావునకు; దరు వాతనితఁడే గాయిక. వాడు రాజ్యమునకుఁ బట్టము గట్టుకొనఁదగి యుండెను. కావున సీతని కధికారము రాకుండఁ జేయుట కొక