పుట:Delhi-Darbaru.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ నంద' రా వు. -

243


లలో, న నేకములందుం బలెఁ బెక్కు కష్టములను గలిగించి యుండెను. మండలములు. మండలములు .గుత్తల కియ్యఁబడుట వలనగుత్తలకుఁ గొనువారొక్కరి నొక్కరు మించు నభిప్రా యముతో నత్యధికముగ లంచము లిచ్చుటయుఁ దమకయిన కర్చులను రాఁబట్టుకొనుట కై రైతులను బీడించుటయు సంభ వించియుండెనని విశేషాంశముగఁ జెప్పఁ బని లేదు. అయిన నింతకంటె నెక్కుడు దురదృష్ట మేనున గుత్తకుఁ బుచ్చుకొనిన వారు బలవంతు లయిన తోడనే స్వామిసొమ్మును చెల్లించుటయే యరుదయి పోఁజొచ్చెను. తప్పుడు. లెక్కలఁ బెట్టి రాజ్యాంగ ద్రవ్యమును హరించు వారనేకు లేర్పడియుండిరి. రాజ్యాంగపుఁ బేరున దుర్వ్యయము లనేకములు చేయఁబడుచుండె. ఇట్లు సూచింపఁబడిన మహా లోపముల నాశ్రయించి స్వల్పలోపము ల నేకములు చూపట్టి తండోప తండములయి పెరిగి రాజ్యాంగపు జీవరసమును చీల్చి వేయుచుండెను. వీనినన్ని టిని.మాన్పుట కొక్క నికి సులభ సాధ్యమగునా! అయిన రెసిడెంటు వాకరు సంస్కార ములఁ జేయుటకు గంకణము గట్టిదనమనోరధమును గొంతవఱకుఁ దీర్చుకొనెను. మండలములను గుత్తలకిచ్చు పద్ధతిని మాన్ప లే డయ్యెను గాని గుత్తగాండ్లను ధగిన వారిని నేరుటయందు మా త్రము మిక్కిలి పరిశ్రమఁ జేసి మోసగాండ్ర నుండి పైకము రాఁ బట్టుటకును లేనిచో వారిని దండించుటకును న్యాయస్థానము నేర్పఱచెను.