పుట:Delhi-Darbaru.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ న 0 ద రా వు.

241


దీనియం దొక్కటి మాత్రము విశేషాంశము గన్పట్టు చున్నది. అంతక మున్ను ఆనంద రావు సాహాయ్య సైన్యము రెండు వేలుండున ట్లేర్పఱచికొని యుండెను. "కాని ఈ సంధి ననుసరించి అదిమూఁడు వేలొనర్పఁబడెను. ఈ సైన్యపుఁగర్చులకయి గాయిక వాడు సంవత్సరమునకు రు 11, 70, 000ల నీను భూభాగమును ఆంగ్లేయులకు నిచ్చి వేసెను. ఇంతియగాక విగ్రహమున కయిన వ్యయమున కయ్యును . అరబ్బీలకియ్యవలసిన యప్పులఁదీర్చుట కయ్యును ఆంగ్లేయులును సాహుకారులును ఆనందరావునకు బదులిచ్చియుండిన రు 41, 38, 782-2-6 లకు గాను కొన్ని పరగ ణాల వరుంబడి ఆ మొత్తము దీరువఱకును ఆంగ్లేయులకును సాహు కారులకును జేరవలసినట్లు నిర్ణయింపఁబడెను. ఆనంద రావు ఆంగ్లేయ ప్రభుత్వము - నాట " యనుమతి లేనిది ఇతర రాష్ట్రములతో విగ్రహము ప్రారంభింప కుండుటకును " ఐరోపి యనుల నైనను అమెరికా వారినై నను. బ్రిటిషువారి ప్రజ లోని స్వదేశీయుల నైనను వారి యుత్తరువు లేనిది తనయెద్ద నౌకరులుగ నుంచుకొన కుండుటకును నిర్ణ యించుకొనెను. నాటినుండి రెసిడెంటు వాకరు మంత్రుల సాహాయ్య మున బరోడా సంస్థాన రాజ్యాంగమును సంస్కరింప మొద లిడెను, 1803 నందె రాంజీ అప్పాజి పరలోకమున కేగి. యుండెను. అతని పదమున కాతని పెంపుడు కుమారుఁడు శీతా రాము నియమింపఁబడెను. కాని ఈశీతారాము వట్టిదుర్మా