పుట:Delhi-Darbaru.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

బరోడా రాష్ట్రము.


మించియుండె. కావున నాతఁడు ఆంగ్లేయులు - సాయము వేడ నుద్యుక్తుఁడయ్యెను. దానినోర్వక యరబ్బీ లొక్క తఱి యాతనిం జంప నెంచియాతని. పల్లకిపై గుండ్లు పర పిరి గాని దానివలన నాతనిబోయీలు మాత్రము మడసిరి. ఈలోపుగ కన్ హోజి తల్లి వలన రేపెట్టఁబడి కాడీజహగీరుదారగు మల్హారి రావును ఆనంద రావున కధర్మసోదరుఁడగు ముకుంద రావును రావ్జీయనంద రావుల పయినెత్తిరా నిర్ణయించుకొని బొంబాయిలోని యాం గ్లేయ ప్రభుత్వము వారి సాయము గోరిరి.. ఇట్లరువాగులవారును దము నాశ్రయించుటవలన నేపక్ష మవలంబించుటకును నిష్టము లేనివారయి యాంగ్లేయులు దమ ప్రతినిధి నొక్కరుని బరోడా కనిపి మధ్యవర్తిత్వము .సలుపుమనిరి. మేజర్ వాకరు 1802 వ సంవత్సరము జనవరి 29వ తేది ఆనగరము చేరి సంగతుల విచా రించెను. అతని తీర్మానములు మల్హరిరావునకు వ్యతి రేకము లయ్యెను. వానికి మల్హరిరావు అంగీకరింపఁడయ్యె. కావున నాం గ్లేయులు ఆనందరావు పక్షమయి 'కాడీజహగీరుదారు తో విగ్రహము వడపిరి. మల్హరిరావు ఓడింపఁబడియె. ఆతనికి 1 1/4 లక్షల విలువగల ఆ స్తినుండనిచ్చి తక్కిన దంతయును ఆనంద రావు నధి కారము క్రిందికి తేఁబడెను. మల్హరిరావు " కనోజియును పలు మారు తిరుగఁబడిరి. అందు.చేత కన్ హోజి 1812లో మద్రాసునకు బ్రవాసమునకుఁ బంపి వేయఁబడెను. మల్హరిరావు బొంబాయి చెఱ సాలయందుంచఁబడగ నచ్చటనే మృతిచెందెను.