పుట:Delhi-Darbaru.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవిందరావు.

233


నజరునిచ్చి ఫ తేసిం గప్పువడిన 36లక్షల కప్పముగట్ట వాగ్దానము ' చేసి సయాజిరావు . పేరుమీఁద గాయిక వాఁడు పదమును బట్టు కొనెను. అయిన సింధియా గోవిందరావు పరమయినందున నతనికిని మానాజికిని పరస్పర కలహములు 1798 లో మానాజి పైలోకమున కేగువఱకును జరుగుచుండెను. వెర్రి సయాజి 1792 లోనే యుసురులు దొరగియుండె. కావున మానాజీ పితృగణములఁ జేరుట తడవుగ గోవిందరావు గాయికవాడు పట్టమునకు సిద్ధమయ్యెను. అయిన నానాఫడ్న వీసునకు బరోడా సంస్థానము నెట్లైన రూపు మాపనలయునను పట్టుదల యంకు రించి యుండె. కావున నాతఁడు గోవిందరావు నుండి నజరుగ నేమి, ఫ తేసింగు చేసిన బాకీదీర్చుటకనియేమి, సేనాఖాన్ ఖేల్ బిరుదమున కయియనియేమి,గాయిక వాడులు చేర్చుటకు సాధ్య ముగాని మొ త్తమును రాఁబట్టఁజూ చెను. సాల బే సంధివలన గా యిక వాడు రాజ్యమునశింపరాదని నిర్ధారణ సేయఁబడి యున్నం దున నాంగ్లేయు లీతరుణమున గోవిందరావు పక్షము వహించి నానాఫడ్నవీసునకు బుద్ధి చెప్పు వారయిరి.

గోవిందరావు (రెండవసారి 1798-1800).

1798 వ సంవత్సరము డిశెంబరు నెల 19 వ తేది గోవింద రావు సేనాఖాస్ ఖేల్ గ నియమింపఁ బడెను. అయిన నింకొకపో రాటము లేక అతఁను ముఖ్య పట్టణమును ప్రవేశింప లేఁ డయ్యెను..