పుట:Delhi-Darbaru.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2:32

బరోడా రాష్ట్ర ము.


పరస్పరము సాహాయ్యము చేసికొన నియమించుకొనిరి. ఈసంధి కిఁ దరువాత సింధియా ఫతేసింగును పీష్వా ప్రక్కకు లాగుకొనుట కెన్నియో ప్రయత్నములొనర్చెనుగాని అవి యెవ్వియును గాయిక వాడును గదలింప లేకపోయెను.

ఇట్లాంగ్లేయుల యెడ సంపూర్ణ విశ్వాసము గలిగి ఫతే సింగు వారికిఁ దోడ్పడు చుండెను. కాని ఈలోపుగ నైజా మును 'హైదరాలియును మహారాష్ట్రులును నైక్యమగుదురను పెద్ద 'భయ మొక్కటి చూపట్టినందున యాజమాన్య ప్రభుత్వము వారు పీష్వాసంధి వాక్యములకుఁ జేవియిచ్చి లోఁబడిరి. అందు వలన సాల బేసంధి 1782 లో జరిగెను. దాని నిబంధనల ననుస రించి గాయిక వాడు మఱల పూర్వపు స్థితికే వచ్చి చేరెను. అతని బొక్క సమునందలి ద్రవ్యము వ్యయమయి యుండుటయు నతని బలములు దగ్గి యుండుటయుఁ దప్ప అతని కేలాటి లాభ మును గలిగినదిగాదు. ఎప్పటివలె పీష్వాకుఁ గప్పము గట్టుట గూడ మఱల నాతనికి సంభవించెను. 1789 వ సంవత్సరము డిశెంబరు నెల 21 వ తేది నతఁడు నగరు మేడ పైనుండి యక సాత్తుగఁబడి మృతి నొందెను.

మానాజి (1789-1793).

ఫతేసింగు చచ్చినతోడనే అతనితోఁగూడ యుద్ధము లలోఁ బని సేయుచుండిన మానాజియనుసోదరుఁడు గోవిందరా వొకమూలనుండి యాక్షేపించుచుండఁగ నె పీష్వాకుఁ దగినంత